SBI Amrut Kalash | కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) తన స్పెషల్ డిపాజిట్ స్కీమ్ ‘అమృత్ కలశ్’ పథకం గడువు మరోమారు పొడిగించింది. 400 రోజుల గడువుతో అమలు చేసిన స్పెషల్ డిపాజిట్ స్కీం గత నెల 31తో ముగియగా, తాజాగా వచ్చే సెప్టెంబర్ 30 వరకూ పొడిగించింది. ఇంతకు ముందూ పలుసార్లు ఈ పథకం గడువును ఎస్బీఐ పొడిగించింది.
ఈ పథకం కింద సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం, మిగతా ఖాతాదారులకు 7.1 శాతం వడ్డీరేటు అందిస్తుంది. ఆదాయం పన్ను చట్టం ప్రకారం వడ్డీపై టీడీఎస్ కోత విధిస్తుంది. ఎస్బీఐ శాఖలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎస్బీఐ యోనో యాప్ ద్వారా ఖాతాదారులు ఈ స్పెషల్ ఫిక్స్ డ్ డిపాజిట్ స్కీం కోసం అప్లయ్ చేసుకోవచ్చు. ఖాతాదారులు రూ.2 కోట్ల లోపు వరకూ డిపాజిట్ చేయొచ్చు. స్వల్ప కాల గడువతో మదుపు చేసే వారికి ఈ పథకం ప్రయోజనకరంగా ఉంటుంది. అవసరమైతే ముందుగానే డిపాజిట్ ఉపసంహరించుకోవచ్చు. క్రెడిట్ ఫెసిలిటీ కూడా ఉంటది.