న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: హైదరాబాద్ కేంద్రంగా వైద్య సేవలు అందిస్తున్న కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(కిమ్స్)లో 1.4 శాతం వాటాను కొనుగోలు చేసింది ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. రూ.239 కోట్లతో 11.49 లక్షల షేర్లను మంగళవారం బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసింది.
సరాసరి షేరు ధర రూ.2,085 కాగా, ఒప్పందం విలువ రూ.239.58 కోట్లు. అలాగే ఐసీఐసీఐ వెంచర్స్కు చెందిన ఇండియా అడ్వాంటేజ్ ఫండ్ ఎస్4 కూడా 10.75 లక్షల షేర్లను ఇదే ధరకు హస్తగతం చేసుకున్నది. దీంతో మంగళవారం కంపెనీ షేరు ధర 1.93 శాతం పెరిగి రూ.2,130.40 వద్ద ముగిసింది.