బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఫిక్స్డ్ డిపాజిట్ దారులకు శుభవార్తను అందించింది. పలు రకాల కాలపరిమితి కలిగిన రూ.2 కోట్లు లేదా అంతకంటే అధిక ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటును అర శాతం వరకు సవరించింది. ఈ వడ్డీరేట్లు ఇటీవల అమలులోకి వచ్చాయి కూడా. రిజర్వు బ్యాంక్ వడ్డీరేటును అరశాతం పెంచడంతో బ్యాంక్ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నది. దీంతో ఏడాది నుంచి రెండేండ్లలోపు టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేటు 4.75 శాతం నుంచి 5.25 శాతానికి చేరుకున్నది. అలాగే సీనియర్ సిటిజన్లకు మరో అర శాతం అధికంగా అంటే 5.75 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది బ్యాంక్. ఇప్పటికే హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్లు తమ డిపాజిట్లపై వడ్డీరేటును పెంచిన విషయం తెలిసిందే.