SBI Home Loans | దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంక్.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) అన్ని రకాల రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) పెంచేసింది. అన్ని టెన్యూర్లపై ఐదు బేసిక్ పాయింట్లు పెంచుతున్నట్లు శుక్రవారం తెలిపింది. దీంతో ఎంసీఎల్ఆర్ ఆధారిత ఇండ్ల రుణాలు తీసుకున్న వారి నెలవారీ వాయిదా చెల్లింపులు (ఈఎంఐ) పెరుగుతాయి. పెంచిన ఎంసీఎల్ఆర్ శనివారం నుంచి అమల్లోకి వస్తుందని ఎస్బీఐ తన వెబ్ సైట్లో వెల్లడించింది.
ఏడాది టెన్యూర్ గల రుణంపై ఎంసీఎల్ఆర్ 8.50 శాతం నుంచి 8.55 శాతానికి పెంపు.. అత్యధిక రుణాలు ఒక ఏడాది ఎంసీఎల్ఆర్ రేటుతో అనుసంధానమై ఉంటాయి.
ఓవర్ నైట్ టెన్యూర్ రుణంపై ఎంసీఎల్ఆర్ 8 శాతం, నెల టెన్యూర్ రునంపై 8.10 శాతం, మూడు నెలల గడువు రుణంపై 8.15 శాతం, ఆరు నెలల టెన్యూర్ రుణంపై 8.45 శాతం వడ్డీరేటు వర్తిస్తుంది.
రెండేండ్ల టెన్యూర్ గల రుణంపై ఎంసీఎల్ఆర్ 8.65 శాతం, మూడేండ్ల టెన్యూర్ రుణంపై 8.75 శాతానికి ఎంసీఎల్ఆర్ పెరిగింది.