బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) డిపాజిట్దార్లకు శుభవార్తను అందించింది. రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటును 15 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. పెంచిన వడ్డీరేట్లు అమలులోకి వచ్చాయి కూడా. రిజర్వు బ్యాంక్ రెపోరేటును అర శాతం పెంచడంతో అటు రుణాలపై వడ్డీరేట్లను పెంచుతున్న బ్యాంక్లు..మరోవైపు డిపాజిట్లపై కూడా వడ్డీరేట్లను సవరిస్తున్నాయి. రెండు నెలల క్రితం ఎఫ్డీలపై వడ్డీరేట్లను సవరించిన బ్యాంక్..ఈ సారి మరో 15 బేసిస్ పాయింట్లు సవరించాయి. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో జనరల్ పబ్లిక్కు 2.90 శాతం నుంచి 5.65 శాతం మధ్యలోకి, సీనియర్ సిటిజన్లకు 3.40 శాతం నుంచి 6.45 శాతం మధ్యలోకి చేరుకున్నాయి. ఈ వడ్డీరేట్ల పెంపు కొత్త డిపాజిట్లతోపాటు మెచ్యూరిటీ డిపాజిట్ల కూడా వర్తించనున్నది.