SBI | రూ.2000 నోట్ల మార్పిడి లేదా డిపాజిట్కు ఎటువంటి ఫామ్గానీ, స్లిప్గానీ అవసరం లేదని ఎస్బీఐ స్పష్టం చేసింది. రూ. 2000 నోట్లను మార్చుకోవడానికి, ఖాతాల్లో జమ చేయడానికి బ్యాంకుల్లో ఫామ్ లేదా స్లిప్ను నింపాల్సి ఉంటుందని, ఆధార్ కార్డ్ తదితర ఐడీలనూ చూపాలంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఇవన్నీ కూడా ఊహాగానాలు మాత్రమేనని కొట్టిపారేసింది.
ఒకసారి రూ.20,000 వరకు రూ.2000 నోట్లను మార్చుకోవచ్చని లేదా డిపాజిట్ చేసుకోవచ్చని తమ అన్ని బ్యాంక్ శాఖలకు విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఎస్బీఐ తెలియజేసింది. ఇదిలావుంటే ఒకరోజులో రూ. 20,000 చొప్పున ఎన్నిసాైర్లెనా రూ.2000 నోట్లను మార్చుకోవచ్చని, ఒకే క్యూలైన్లో ఇందుకోసం ఎవరైనాసరే మళ్లీమళ్లీ నిల్చోవచ్చని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.