SBI Debit Card Charges | ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. డెబిట్కార్డుల ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన ధరలు వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి వస్తాయని వెల్లడించింది. ఎస్బీఐ కార్డుల నిర్వహణకు సంబంధించిన ఛార్జీలను సవరిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఎస్బీఐ క్లాసిక్, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్లెస్ డెబిట్కార్డులపై రూ.125తో పాటు జీఎస్టీని వసూలు చేస్తున్నది.
ఆయా కార్డులపై వచ్చే నెల నుంచి రూ.200 పెంచింది. అదనంగా జీఎస్టీ సైతం చెల్లించాల్సి ఉంటుందని వెబ్సైట్లో పేర్కొంది. ప్రస్తుతం ఉన్న చార్జీలతో పోలిస్తే దాదాపు 70శాతం వరకు పెంచింది. ఇక యువ, గోల్డ్, కాంబో డెబిట్ కార్డ్, మై కార్డ్ (Image Card)కార్డులపై మెయింటనెన్స్ ఛార్జీలు రూ.175, అదనంగా జీఎస్టీ ఉండగా.. దాన్ని రూ.250 ప్లస్ జీఎస్టీ చెల్లించాలి రానున్నది. ప్లాటినమ్ డెబిట్ చార్జీలు రూ.250 ప్లస్ జీఎస్టీ ఉండగా.. రూ.325 ప్లస్ జీఎస్టీకి పెంచుతూ నిర్నయం తీసుకున్నది. ప్రీమియం కార్డుల చార్జీలను రూ.425 ప్లస్ జీఎస్టీకి పెంచింది. ఛార్జీల పెంపుతో వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు.