న్యూఢిల్లీ : ఏటీఎం లావాదేవీల్లో అవకతవకలకు చెక్ పెట్టేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తాజా నిబంధనలను ప్రవేశపెట్టింది. కొత్త రూల్స్కు అనుగుణంగా ఎస్బీఐ ఏటీఎంల్లో నగదు విత్డ్రా లావాదేవీని పూర్తి చేసేందుకు కస్టమర్లు ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
ఎస్బీఐ ఏటీఎంల్లో ఒక లావాదేవీలో రూ 10,000 అంతకుమించి నగదు విత్డ్రా చేసే వారికి ఈ నిబంధన వర్తిస్తుంది. ఫ్రాడ్లకు కళ్లెం వేస్తూ కస్టమర్లకు మరింత ప్రొటెక్షన్ కల్పించే ఉద్దేశంతో ఎస్బీఐ ఈ నిబంధనను ప్రవేశపెట్టింది. ఏటీఎంల అవకతవకలపై ఎస్బీఐ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా సహా ఇతర వేదికల ద్వారా వినియోగదారుల్లో అవగాహన కల్పిస్తున్నది.
నాలుగంకెలతో కూడిన సిస్టమ్ జనరేటెడ్ ఓటీపీ కస్టమర్ రిజిస్టర్ నెంబర్కు వస్తుందని, ఇది ఒక ట్రాన్సక్షన్కు మాత్రమే వర్తిస్తుందని బ్యాంక్ తెలిపింది. ఎస్బీఐ ఏటీఎంలన్నింటిలోనూ ఓటీపీ ఆధారిత నగదు విత్డ్రాయల్ సిస్టమ్ అమలుపై గత కొద్దినెలలుగా బ్యాంకు విస్తృతంగా ప్రచారం చేస్తోంది.