SBI Alert | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన కస్టమర్లకు అలర్ట్ జారీ చేసింది. ఇతరుల నుంచి మనీ పొందడానికి కస్టమర్లు తమ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సిన అవసరమే లేదని తేల్చి చెప్పింది. అదే టైంలో డబ్బు పొందడానికి పిన్ నంబర్ ఎంటర్ చేయనవసరం లేదని వివరించింది. ఒకవేళ మీరు నిర్లక్ష్యంగా పిన్ నంబర్ నమోదు చేసినా, కొందరి నుంచి పేమెంట్ కోసం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా మీకు మోసం చేసినట్లేనని వెల్లడించింది. కస్టమర్లు తమ ఖాతాల నుంచి మాత్రమే నగదు విత్ డ్రా చేయాలని సూచించింది.
మోసగాళ్లు మీ నంబర్కు ఫోన్ చేసి మీరు బహుమతి గెలుచుకున్నారని, మీకు ఒక క్యూఆర్ కోడ్ పంపుతాను.. మీరు దాన్ని స్కాన్ చేసి ధృవీకరించుకోవడానికి పిన్ నంబర్ ఎంటర్ చేయాలని చెబుతారు.
ఆ క్యూఆర్ కోడ్ను మోసగాళ్లు టాంపర్ చేసి మరో క్యూఆర్ కోడ్ రీప్లేస్ చేస్తారు. మీ పేరు మీదే ఇదంతా చేస్తారు. ఒకవేళ మీరు అప్రమత్తంగా లేకుండా నగదు చెల్లింపులు చేసినట్లయితే, అది కొందరు మోసగాళ్లకు చేసినట్లే. మోసగాళ్ల ఎత్తులు జిత్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్బీఐ సూచిస్తున్నది.
కనుక ఎవరేం చెప్పినా వారి నుంచి నగదు పొందడానికి మీ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయొద్దు.
ఎట్టి పరిస్థితుల్లో ఇతరులు డబ్బు చెల్లిస్తామంటే పిన్ నంబర్ లేదా పాస్వర్డ్ టైం చేయొద్దు.
యూపీఐ పిన్ నంబర్ కేవలం మనం నగదు చెల్లింపులు చేయడానికి మాత్రమే. ఇతరుల నుంచి నగదు మనం నగదు స్వీకరించడానికి కాదు. మనీ చెల్లింపులు జరిపిన ప్రతిసారీ మొబైల్ నంబర్, పేరు చెక్ చేసుకోవాలి.
ఇతరులకు పిన్ నంబర్ గానీ, పాస్వర్డ్ గానీ షేర్ చేయొద్దు. ఏదైనా సమస్య తలెత్తితే సంబంధిత అధికారుల నుంచి సాయం తీసుకోవాలి. చెల్లింపుల్లో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే, సంబంధిత సెక్షన్ సాయం తీసుకోవాలి.