హైదరాబాద్, ఏప్రిల్ 19 : ప్రముఖ మొబైల్ సంస్థ సామ్సంగ్..మరో 5జీ ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. గెలాక్సీ సిరీస్లో భాగంగా విడుదల చేసిన ఈ ఎం14 మొబైల్ ప్రారంభ ధర రూ.13,490. 6+128 జీబీ మాడల్ ధర రూ.14,990గా నిర్ణయించింది. 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా, 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 5ఎన్ఎం ప్రాసెసర్, 12 జీబీ ర్యామ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగిన ఫోన్ ఒక్కసారి చార్జింగ్ చేస్తే రెండు రోజులు రానున్నది. ఈ నెల 21 నుంచి అమెజాన్, సామ్సంగ్. కామ్తోపాటు ఎంపిక చేసిన రిటైల్ అవుట్లెట్లలో ఈ ఫోన్ లభించనున్నదని కంపెనీ మొబైల్ డివిజన్ డైరెక్టర్ వరుణ్ సచ్దేవ్ తెలిపారు.