Samsung Galaxy S23 FE 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ జెయింట్ శాంసంగ్ (Samsung) భారత్ మార్కెట్లోకి మరో ప్రీమియం సెగ్మెంట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ 5జీ (Samsung Galaxy S23 FE 5G) ఫోన్ ఈ నెలాఖరులో భావిష్కరించనున్నది. ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్ వేదికగా సేల్స్ ప్రారంభించనున్నది.
ఎక్సోనోస్ 2200 ఎస్వోసీ చిప్ సెట్ లేదా స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 ఎస్వోసీ చిప్ సెట్తో వస్తుందని తెలిపింది. శాంసంగ్ ఇండియా తన ఎక్స్ (మాజీ ట్విట్టర్) ఖాతాలో ‘న్యూ ఎపిక్ కమింగ్ సూన్’ అనే ట్యాగ్ లైన్తో పోస్ట్ పెట్టింది. అందులో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉన్నట్లు తెలుస్తున్నది.
50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతో కూడి ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇంకా 8-మెగా పిక్సెల్ సెకండరీ కెమెరా, 12-మెగా పిక్సెల్ టెలిఫొటో కెమెరాతోపాటు సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 10-మెగా పిక్సెల్ కెమెరా ఉండొచ్చు. 25 వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 4500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుందని భావిస్తున్నారు.
ఆండ్రాయిడ్ 13 వర్షన్పై పని చేస్తుందీ ఫోన్. నాలుగేండ్ల పాటు ఓఎస్ అప్ డేట్స్, ఐదేండ్లు సెక్యూరిటీ అప్ డేట్స్ అందిస్తుంది. 6.4-అంగుళాల డైనమిక్ అమోలెడ్ స్క్రీన్ విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ తో వస్తుందని భావిస్తున్నారు.
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎస్ఈ ఫోన్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.54,999, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.59,999 పలుకుతుంది. శాంసంగ్ గత ఫిబ్రవరిలో మార్కెట్లో ఆవిష్కరించిన గెలాక్సీ ఎస్23 ఫోన్ ధర రూ.74,999 పలికింది.
Epic moments are now closer than ever. Get ready to experience the new epic. Launching soon. #Samsung pic.twitter.com/68xhvNMb3o
— Samsung India (@SamsungIndia) September 22, 2023