న్యూఢిల్లీ : శాంసంగ్ భారత్లో బుధవారం తన తొలి ఎఫ్ సిరీస్ 5జీ స్మార్ట్ఫోన్..గెలాక్సీ ఎఫ్ 42 5జీని భారత్ మార్కెట్లో లాంఛ్ చేసింది. నైట్ మోడ్తో 64ఎంపీ ట్రిపుల్ కెమెరా, 6.6 ఇంచ్ ఎఫ్హెచ్డీ డిస్ప్లే, 12 బ్యాండ్స్ 5జీ సపోర్ట్తో ఈ స్మార్ట్ఫోన్ అందుబాటులో ఉంది. 6జీబీ, 128జీబీ మెమరీ వేరియంట్స్తో కూడిన గెలాక్సీ ఎఫ్42 5జీ రూ 20,999, రూ 22,999కి లభిస్తుంది.
బ్లాక్, ఆక్వా కలర్ ఆప్షన్స్లో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ఫోన్ సేల్స్ ఆదివారం అక్టోబర్ 3 నుంచి ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన రిటైల్ అవుట్లెట్స్తో పాటు శాంసంగ్ ఆన్లైన్ స్టోర్, ప్లిఫ్కార్ట్ ద్వారా ఈ స్మార్ట్ఫోన్ అందుబాటులో ఉంటుంది.
ప్లిఫ్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్లో భాగంగా ఎఫ్42 5జీ వేరియంట్ల ఆధారంగా రూ 17,999, రూ 19,999లకే సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ఫోన్తో కస్ఠమర్లు 5జీ ప్రయోజనాలను ఆస్వాదించవచ్చని శాంసంగ్ ఇండియా మొబైల్ మార్కెటింగ్ హెడ్ ఆదిత్య బబ్బర్ పేర్కొన్నారు.