న్యూఢిల్లీ : హైదరాబాద్ సహా ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి- సెప్టెంబర్ మధ్య రూ. 4 కోట్ల పైబడిన విలువ కలిగిన లగ్జరీ హోం విక్రయాలు (Sale Of Houses) దాదాపు రెట్టింపయ్యాయని రియల్ ఎస్టేట్ సంస్ధ సీబీఆర్ఈ నివేదిక వెల్లడించింది. లగ్జరీ హోం సేల్స్లో హైదరాబాద్, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై నగరాల నుంచే 90 శాతం సేల్స్ సమకూరాయి.
సానుకూల ఆర్ధిక వృద్ధి, రాబడి పెంపు, మెరుగైన జీవన ప్రమాణాలతో కూడిన ఇండ్లకు పెరిగిన గిరాకీ వంటి పలు కారణాలతో లగ్జరీ హోం సేల్స్ గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఏకంగా 97 శాతం పెరిగాయి. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య పండగ సీజన్తో లగ్జరీ ఇండ్ల విక్రయాల్లో మరింత పెరుగుదల నమోదవుతుందని సీబీఆర్ఈ అంచనా వేసింది.
అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్లో తొలిసారి లగ్జరీ ఇండ్ల కొనుగోలుదారుల సంఖ్య పెరగనుందని ఈ సంస్ధ పేర్కొంది. వృద్ధి రేటు పెరగడం, డెవలపర్లు, స్మార్ట్ హోం టెక్నాలజీలు అందిస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలతో ఇండ్ల విక్రయాలు పెరిగాయని సీబీఆర్ఈ నివేదిక పేర్కొంది. మెరుగైన జీవనశైలితో కూడిన ఇండ్లకు డిమాండ్ పెరుగుతున్నదని, దీంతో 2023లో పదేండ్ల గరిష్ట స్ధాయిలో ప్రీమియం, లగ్జరీ సెగ్మెంట్లో రెసిడెన్షియల్ సేల్స్, న్యూ లాంఛ్లు పెరుగుతున్నాయని సీబీఆర్ఈ నివేదిక తెలిపింది.
Read More :
Predator Drones: ప్రిడేటర్ డ్రోన్ల కోసం అమెరికాతో త్వరలో ఒప్పందం !