హైదరాబాద్, మే 14: రిటైల్ టెక్స్టైల్ సంస్థ సాయి సిల్క్స్(కళామందిర్) లిమిటెడ్ సీఈవోగా భరద్వాజ్ రాచమడుగు నియమితులయ్యారు. గత కొన్నేండ్లుగా ఆర్గనైజేషన్తో మంచి సంబంధాలు ఉన్న భరద్వాజ్.. గ్రూపు ఈ-కామర్స్ వర్టికల్, నిర్వహణ, వ్యాపార విస్తరణ, కంపెనీ ఐపీవోలో కీలక పాత్ర పోషించారని కంపెనీ ఫౌండర్, ఎండీ ప్రసాద్ చలవాడి తెలిపారు.