Rupee @80 | ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్పై రూపాయి మారకం విలువ ఆల్టైం కనిష్ట స్థాయికి పతనమైంది. చరిత్రలో తొలిసారి 80కి పడిపోయింది. సోమవారం మార్కెట్ ముగింపు దశలో 15 పైసలు కోలుకుని 79.97 వద్ద స్థిర పడింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరగడంతోపాటు దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు నిరంతరం నిధుల ఉపసంహరణకు దిగడంతో రూపాయి విలువ పతనానికి కారణం అని భావిస్తున్నారు.
సోమవారం మార్కెట్ ట్రేడింగ్ మొదలైనప్పుడు 79.76 వద్ద మొదలై తర్వాత బలహీన పడింది. డాలర్పై ఒకానొక దశలో 80 పైసలకు పడిపోయింది. ఇది కొద్ది సేపు అలాగే కొనసాగింది. చివరకు ముగింపు దశలో 15 పైసల లబ్ధితో 79.76 వద్ద నిలిచింది.
శుక్రవారం 80 పైసల సమీపానికి పడిపోయిన రూపాయి తిరిగి 17 పైసలు కోలుకుని 79.82 వద్ద స్థిర పడింది. అమెరికా డాలర్ బలహీనంగా ఉండటంతో ఇండియన్ రూపాయి దేశీయ మార్కెట్లో శుభారంభం ఇచ్చింది. కానీ మధ్యాహ్నానికి క్రూడాయిల్ ధరల పెరుగుదల, ఈక్విటీల నుంచి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నిధుల ఉపసంహరణతో రూపాయి బలహీన పడిందని బీఎన్పీ పరిబాస్ రీసెర్చ్ అనలిస్ట్ అనూజ్ చౌదరి తెలిపారు.
బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ధర 2.06 శాతం పెరిగి బ్యారెల్పై 103.24 డాలర్లుగా ఉంది. దేశీయ స్టాక్ మార్కెట్లో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 760.37 పాయింట్ల లాభంతో 54,521.15 పాయింట్లకు చేరుకుంది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 229.30 పాయింట్లు నష్టపోయి 16,278.50 పాయింట్ల వద్ద స్థిర పడింది. దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు శుక్రవారం ఒక్కరోజే రూ.1649.36 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు.