Indian Rupee | న్యూఢిల్లీ, జూలై 11: దేశీయ కరెన్సీ విలువ ఎట్టకేలకు కోలుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్కు డిమాండ్ పడిపోవడం, ఈక్విటీ మార్కెట్లోకి విదేశీ మదుపరులు నిధులు కుమ్మరించడంతో మారకం విలువ 18 పైసలు ఎగబాకింది. ఫారెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి 82.41 వద్ద స్థిరపడింది.
82.32 స్థాయి నుంచి 82.43 స్థాయిలో కదలాడిన డాలర్తో పోలి స్తే రూపాయ మారకం విలువ చివరకు లాభపడింది. దీంతో వరుసగా రెండోరోజు కరెన్సీ విలువ బలపడినట్టు అయింది. గత రెండు సెషన్లలో డాలర్-రుపీ ఎక్సేంజ్ రేటు 20 పైసలు పెరిగింది. మరోవైపు, బ్రెంట్ క్రూడాయిల్ ధర 1.98 డాలర్లు పెరిగి 79.23 డాలర్లకు చేరుకున్నది.