న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో ( Union Buget ) ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి రూ.1500 కోట్లు కేటాయించారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించడం అనేద గత కొన్నేండ్లుగా ఆనవాయితీగా వస్తున్నది. దేశంలో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ప్రమోట్ చేయడానికి దేశ్ స్టాక్ అనే ఈ-పోర్టల్న లాంచ్ చేయబోతున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. అదేవిధంగా ప్రధాని మంత్రి హౌసింగ్ స్కీమ్ కింద నిర్మించే హైజింగ్ ప్రాజెక్టుల కోసం ఈ బడ్జెట్లో రూ.48 వేల కోట్ల రూపాయలు కేటాయించారు.
ముఖ్యంగా పబ్లిక్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్కు ఈ బడ్జెట్లో అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఇక దేశం సాధించాల్సిన లక్ష్యాలలో ఎనర్జీ ట్రాన్షిషన్, క్లైమేట్ యాక్షన్ ప్రధానంగా ఉన్నాయన్నారు. ట్రాన్స్పోర్టు, లాజిస్టిక్స్కు మరింత ఊతమిచ్చేలా బడ్జెట్లో చర్చలు తీసుకున్నారు.