గోవా, నవంబర్ 25: లగ్జరీ బైకుల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్.. తన హిమాలయన్ సరికొత్త మాడల్ను మార్కెట్లోకి విడుదల చేసింది. నాలుగు రకాల్లో లభించనున్న ఈ బైకు ప్రారంభ ధర రూ. 2.69 లక్షలు కాగా, గరిష్ఠంగా రూ.2.84 లక్షలు నిర్ణయించింది.
ఈ ధరలు డిసెంబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయని, ఆ తర్వాత ఈ బైకుల ధరలు పెరిగే అవకాశం ఉన్నది. 452 సీసీ సామర్థ్యంతో రూపొందించిన ఈ బైకు లీటర్కు 28 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది.