సియోల్ : ఆటోమేషన్ యుగంలో పని ప్రదేశంలో భద్రతా ప్రమాణాలపై ఆందోళన నెలకొంటోంది. దక్షిణ కొరియాలోని ఓ పెప్పర్ సార్టింగ్ ప్లాంట్లో దారుణ ఘటన ఆటోమేషన్ వినియోగంపై అప్రమత్తత అవసరాన్ని నొక్కిచెబుతోంది. ప్లాంట్లో వెజిటబుల్ బాక్స్గా భ్రమించి మనిషిని రోబో (Robot) తోసివేయడంతో వ్యక్తి మరణించిన ఘటన కలకం రేపింది.
కన్వేయర్ బెల్ట్స్పై కూరగాయల బాక్సులను విసిరేసి, వాటిని అమర్చేందుకు రోబోటిక్ ఆర్మ్స్ను ఉపయోగిస్తున్నారు. రోబోటిక్ ఆర్మ్ మనిషిని కూరగాయల బాక్స్గా పొరపడి తోసివేయడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
కన్వేయర్ బెల్ట్పైకి వ్యక్తిని తోసివేయడంతో అతడి ముఖం, ఛాతీ నలిగిపోయింది. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటన అనంతరం అత్యంత సురక్షిత, కచ్చితత్వంతో కూడిన వ్యవస్ధ అమలుకు డాంగ్సెంగ్ ఎక్స్పోర్ట్ అగ్రికల్చర్ కాంప్లెక్స్ అధికారులతో పాటు ప్లాంట్ యజమాని పిలుపు ఇచ్చారు.
Read More :