ముంబై: ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్).. జూన్తో ముగిసిన త్రైమాసికంలో రూ.12,273 కోట్ల నికర లాభం గడించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 7.25 శాతం తక్కువ.
గతేడాది (2020-21) చివరి త్రైమాసికం రిలయన్స్ నికర లాభం రూ.13,233 కోట్లుగా నిలిచింది. అయితే సంస్థలో ప్రధానమైన రిలయన్స్ రిటైల్, రిలయన్స్ జియో ఆరోగ్య కరమైన గ్రోత్ కనబర్చాయి.
రిటైల్ నికర లాభం ఇలా
రిలయన్స్ రిటైల్ నికర లాభం రెట్టింపుకు పైగా నమోదైంది. అయితే, టెలికం మేజర్ జియో నికర లాభం 45 శాతం మాత్రమే పెరిగింది.