Inflation | గత నెలలో చిల్లర ద్రవ్యోల్బణం కాస్త శాంతించింది. 2022 మే చిల్లర ద్రవ్యోల్బణం ( Retail inflation ) 7.04 శాతానికి దిగి వచ్చింది. అయినా ఆర్బీఐ పరిమితి కంటే ఎక్కువ స్థాయిలో రిటైల్ ద్రవ్యోల్బణం నమోదు కావడం ఇది ఐదోసారి. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడంతోపాటు ఆహార ధాన్యాల ధరలు పెరిగాయని ప్రభుత్వం సోమవారం వెలువరించిన డేటా పేర్కొంది. గత ఏప్రిల్ నెల చిల్లర ద్రవ్యోల్బణం 7.79 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే.
భారీగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో గత నెలలో కేంద్రం అప్రమత్తమైంది. ధరలపై పోరుకు పెట్రోల్, డీజిల్లపై పన్నులో కోత విధించింది. ఇతర నిత్యావసర వస్తువులపై పన్ను వ్యవస్థను సవరించింది. పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉండటంతో గోధుమలు, టమాటా, బంగాళదుంప ఇతర కూరగాలయ ధరలు భారీగా పెరిగాయి. ఉత్తర భారతావనిలో వేడి గాలుల వల్ల పంటల దిగుబడులు తగ్గిపోయాయి.
ఏప్రిల్లో కటాఫ్ స్థాయి కంటే చిల్లర ద్రవ్యోల్బణం నమోదు కావడంతో గత నెల 40 బేసిక్ పాయింట్లు, ఈ నెల 50 బేసిక్ పాయింట్లు ఆర్బీఐ రెపొరేట్ పెంచేసింది. గత డిసెంబర్ నుంచి ద్రవ్యోల్బణం.. ఆర్బీఐ కటాఫ్ స్థాయికి పైనే నమోదవుతున్నది.