న్యూఢిల్లీ: వాణిజ్య సిలిండర్లపై ఉన్న అన్ని రకాల ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకుంది. యుద్ధానికి ముందు ఉన్న స్థాయిల్లో వాణిజ్య సిలిండర్లను కేంద్రం సరఫరా చేస్తుందని పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ అన్ని రాష్ర్టాలకు లేఖ రాశారు.
వాణిజ్య సిలిండర్ల సరఫరాను యుద్ధానికి ముందు ఉన్నట్టుగానే సరఫరా చేయాలని అందులో పేర్కొన్నారు. పీఎన్జీ గ్యాస్కు మారిన వినియోగదారులు దాన్ని కొనసాగించాలని లేఖలో తెలిపారు. యుద్ధ సంక్షోభం తొలగిపోవడంతో ఆ ప్రయోజనాలు కస్టమర్లకు చేరేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయన్నారు.