ముంబై, జూన్ 22: ప్రపంచ ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉన్నప్రస్తుత తరుణంలో అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందాల్లో ఏదైనా ఆటంకం కలిగినా లేదా నైరుతి రుతుపవనాలు ప్రతికూలంగా ఉంటే దేశ వృద్ధికి సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉన్నదని రిజర్వ్ బ్యాంక్ స్పష్టంచేసింది. సోమవారం సెంట్రల్ బ్యాంక్ ప్రత్యేక బులెటిన్ను విడుదల చేసింది. పశ్చిమాసియాలో ఇటీవల మధ్యంతర శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య అం తరాయాలు కొనసాగాయని పేర్కొంది.
శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు ఇంకా బలహీనంగానే ఉన్నాయని తెలిపింది. 2025-26 నాలుగో త్రైమాసికంలో భారత్ 7.8 శాతం వృద్ధిని సాధించింది. ఎఫ్డీఐలు రావడంతోపాటు విదేశీ మారకం నిల్వలు గరిష్ఠ స్థాయిలో ఉండటంతో భారత్ ఆర్థిక మూలాలు స్థిరంగా ఉన్నాయని పేర్కొంది. మరోవైపు, కమర్షియల్ ఎల్పీజీ ధరలను భారీగా పెంచడంతో ధరల సూచీ భారీగా పెరిగే అవకాశాలున్నాయని తెలిపింది.