న్యూఢిల్లీ : ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ (Flipkart) సామర్ధ్యం ఆధారంగా ఉద్యోగుల తొలగింపునకు కసరత్తు సాగిస్తోంది. మొత్తం ఉద్యోగుల్లో 5-7 శాతం మంది ఉద్యోగులపై కంపెనీ వేటు వేయనుంది. ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ నాటికి ఈ ప్రక్రియను ముగించాలని ఫ్లిప్కార్ట్ యోచిస్తోంది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా గత ఏడాది నుంచి తాజా నియామకాలను ఫ్లిప్కార్ట్ నిలిపివేసింది.
గత రెండేండ్లుగా కంపెనీ సామర్ధ్యం ఆధారంగా ఉద్యోగులపై వేటు వేయడంతో పాటు ఏటా పలువురు ఉద్యోగులను తొలగిస్తోంది. ప్రస్తుతం కంపెనీలో 22,000 మంది ఉద్యోగులుండగా వారిని వివిధ విభాగాల్లో సమర్ధంగా వినియోగించుకుంటూ 5 నుంచి 7 శాతం సిబ్బందిని తప్పించాలని ఫ్లిప్కార్ట్ కసరత్తు సాగిస్తోంది. వచ్చే నెలలో జరిగే సీనియర్ ఎగ్జిక్యూటివ్ల సమావేశంలో పునర్వ్యవస్ధీకరణ ప్రణాళికలు, 2024 రోడ్మ్యాప్ను కంపెనీ ఖరారు చేయనుంది.
ఆర్ధిక మందగమనం నేపధ్యంలో పేటీఎం, అమెజాన్, మీషో వంటి పలు కంపెనీలు సైతం ఇటీవల ఇదే తరహా వ్యయ నియంత్రణ చర్యలను చేపడుతున్నాయి. ఇక 2023లో పలు ఆటుపోట్లు ఎదుర్కొంటున్న ఫ్లిప్కార్ట్ నిలకడైన వృద్ధి కోసం ప్రతిపాదిత పునర్వ్యవస్ధీకరణపై దృష్టి సారించింది. ఈ-కామర్స్ పరిశ్రమలో దీర్ఘకాలిక వృద్ధిపైనా కంపెనీ ఫోకస్ పెడుతోంది.
Read More :
Ayodhya Ram Mandir | అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ.. ఆలియా, రణ్బీర్లకు ఆహ్వానం