Women | ముంబై, మార్చి 20: దేశీయంగా పనిచేసే మహిళల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 69.2 కోట్ల మంది మహిళల్లో 37 శాతం మంది మహిళలు పనిమంతులే అని కేరియర్నెట్స్ ‘ది స్టేట్ ఆఫ్ వుమెన్స్ ఎంప్లాయిమెంట్ ఇన్ ఇండియా’ పేరుతో బుధవారం విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. అత్యధిక మంది మహిళా ఉద్యోగులు కలిగిన నగరాల జాబితాలో 34 శాతంతో హైదరాబాద్ తొలి స్థానంలో నిలిచింది. ఆ త ర్వాతి స్థానాల్లో 33 శాతంతో పుణె, 29 శాతంతో చెన్నై ఉన్నాయి.
2022తో పోలిస్తే ఆ మరుసటి ఏడాదిలో మహిళా ఉద్యోగుల సంఖ్య 2-5 శాతం వరకు పెరిగారని తెలిపింది. ముఖ్యంగా జూనియర్ ప్రొఫెషనల్స్, ఎగ్జిక్యూటివ్ బోర్డ్ల్లో పనిచేసేవారు అధికంగా ఉన్నట్లు పేర్కొంది. గతేడాది కొత్తగా ఉద్యోగాలు పొందిన వారిలో 40 శాతం మంది ఫ్రెష్ ట్యాలెంట్ అని పేర్కొంది. మొత్తం ఉద్యోగ కల్పనలో 0-3 ఏండ్ల అనుభవం, 3 నుంచి 7ఏండ్ల అనుభవం ఉన్నవారి వాటా 20-25 శాతం వరకు ఉన్నారని తెలిపింది. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగా ల్లో అత్యధిక మంది మహిళకు ఉద్యోగాలు లభించాయి.