Crisil Report : రానున్న ఆర్ధిక సంవత్సరంలో భారత్ ఎకానమీ 6.8 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. 2031 నాటికి భారత్ ఎగువ మధ్య ఆదాయ ఆర్ధిక వ్యవస్ధగా ఎదుగుతుందని పేర్కొంది. భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా ఎదిగేందుకు చేపట్టే చర్యలు, సంస్కరణల వెన్నుదన్నుతో 2031 నాటికి భారత్ ఈ కీలక మైలురాయిని అధిగమిస్తుందని క్రిసిల్ అంచనా వేసింది.
ప్రస్తుత ఆర్ధిక సంసత్సరంలో అంచనాలకు మించి 7.6 శాతం వృద్ధితో దేశ జీడీపీ 2025 ఆర్ధిక సంవత్సరంలో 6.8 శాతం వృద్ధి సాధించే అవకాశం ఉందని క్రిసిల్ ఇండియా అవుట్లుక్ నివేదిక పేర్కొంది. 2025 నుంచి 2031 వరకూ ఏడు సంవత్సరాల్లో భారత్ ఎకానమీ 5 లక్షల కోట్ల డాలర్లను దాటి 7 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది.
రాబోయే 7 ఏండ్లలో భారత్ ఈ ఘనతను సాధిస్తుందని పేర్కొంది. ఈ కాలంలో భారత్ సగటు వృద్ధి 6,7 శాతంతో ప్రపంచంలోనే భారత్ మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా ఎదుగుతుందని క్రిసిల్ నివేదిక స్పష్టం చేసింది. 2031 నాటికి భారత్ ఎగువ మధ్య ఆదాయ గ్రూప్లో చేరుతుందని, అప్పటికి దేశ తలసరి ఆదాయం రూ. 3,73,500కు చేరుతుందని పేర్కొంది.
Read More :
Gadwal | ఆర్టీసీ బస్సుల్లేక విద్యార్థుల అవస్థలు.. ట్రాక్టర్లో స్కూల్కు..