హైదరాబాద్, ఫిబ్రవరి 4: ఎల్ఐసీ పాలసీ హోల్డర్లు..ల్యాప్స్ అయిన పాలసీలను పునరుద్ధరించుకునే అవకాశాన్ని సంస్థ కల్పించింది. ల్యాప్స్ అయిన వ్యక్తిగత పాలసీల కోసం ఈ నెల 7 నుంచి మార్చి 25 వరకూ ప్రత్యేక పునరుద్ధరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఎల్ఐసీ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. తప్పని పరిస్థితుల్లో ప్రీమియం చెల్లింపులు చేయలేకపోయిన పాలసీ హోల్డర్ల ప్రయోజనానికి ఈ క్యాంపైన్ నిర్వహిస్తున్నామన్నది. ప్రీమియం చెల్లించని నాటి నుంచి ఐదేండ్లలోపుగా ఉన్న కొన్ని అర్హమైన పాలసీలను పునరుద్ధరించనున్నట్టు పేర్కొంది. అర్హమైన పాలసీలకు ఆలస్యరుసుంలో 20 నుంచి 30 శాతం వరకూ రాయితీ అందిస్తున్నట్టు తెలిపింది. మైక్రో ఇన్సూరెన్స్ పాలసీలపై పూర్తి రాయితీ ఉంటుందన్నది.