చెన్నై, మార్చి 27: జపాన్కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్..ఫ్రాన్స్కు చెందిన రెనో జట్టుకట్టాయి. జాయింట్ వెంచర్లో ఏర్పాటైన రెనో నిస్సాన్ దేశీయ మార్కెట్లోకి నాలుగు సరికొత్త మాడళ్లను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని రెనో నిస్సాన్ అలయెన్స్ చైర్పర్సన్ జీన్-డొమినిక్యూ సెనార్డ్ తెలిపారు. ప్రస్తుతం రిటైల్ అవుట్లెట్లలో ఐదు మాడళ్లు విక్రయిస్తున్నట్లు, వీటిలో నిస్సాన్ ప్లాట్ఫాం కింద రెండు మాడళ్లు, రెనో బ్రాండ్ కింద మూడు మాడళ్లను విక్రయిస్తున్నట్లు చెప్పారు. ఇరు సంస్థలు కలిసి ఇప్పటికే భారత్లో 1.8 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టినట్లు, భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందన్నారు.