న్యూఢిల్లీ, మార్చి 30: ప్రముఖ వాహన తయారీ సంస్థ రెనో..దేశీయ మార్కెట్లోకి సరికొత్త కాంప్యాక్ట్ ఎస్యూవీ కిగర్ను పరిచయం చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.5.84 లక్షలుగా నిర్ణయించింది. అడ్వాన్స్ ఫీచర్స్, మల్టీ-సెన్స్ డ్రైవింగ్ మోడ్స్, క్యాబిన్ స్టోరేజ్, కార్గో స్థలాన్ని మరింత పెంచింది. అంతర్జాతీయ మార్కెట్లోకి విడుదల చేయకముందు భారత్లో ప్రవేశపెట్టిన మూడో మోడల్ ఇదే కావడం విశేషం. ఈ కారు మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇంజిన్లలలో లభించనున్నది. అలాగే వైర్లెస్ స్మార్ట్ఫోన్ చార్జింగ్ సదుపాయం కూడా ఉన్నది.