Work From Home | కరోనా మహమ్మారి ఉద్యోగులు, కార్మికులు, అధికారులు, సిబ్బంది పని జీవితంలో అసాధారణ మార్పులే తీసుకొచ్చింది. దాదాపు రెండేండ్ల క్రితం మొదలైన వర్క్ ఫ్రం హోం సంస్కృతి.. ఇంకా కొనసాగుతూనే ఉంది. సెకండ్ వేవ్ తగ్గిన తర్వాత ఆఫీసులకు మళ్లాలని దిగ్గజ సంస్థలన్నీ ఆదేశాలు జారీ చేసేలోపే కరోనా న్యూవేరియంట్ ఒమిక్రాన్ కమ్ముకొచ్చింది. శరవేగంగా విస్తరిస్తుండటంతో వివిధ రంగాల సంస్థలన్నీ తిరిగి తమ సిబ్బందిని వర్క్ ఫ్రం హోంకే పరిమితం చేశాయి. అయితే.. ఒమిక్రాన్ ప్రభావం తగ్గుతున్నట్లు అనిపించినా.. సిబ్బంది మెజారిటీ రిమోట్ వర్కింగ్ అంటే వర్క్ ఫ్రం హోం కల్చర్నే ఇష్ట పడుతున్నారట. 82 శాతం మంది నిపుణులు, కార్మికులు, ఉద్యోగులు వర్క్ ఫ్రం హోంకే మొగ్గుతున్నారు తప్ప ఆఫీసుకెళ్లడానికి సిద్ధంగా లేరని తెలుస్తున్నది. వర్క్ ఫ్రం హోం పుణ్యమా? అని కొత్త అలవాట్లు పుట్టుకొచ్చాయంటుయని జాబ్ సైట్ సైకీ నిర్వహించిన టెక్ టాలెంట్ ఔట్లుక్ సర్వేలో తేలింది.
నాలుగు ఖండాల నుంచి 100 మందికి పైగా సీ-సూట్, హ్యూమన్ క్యాపిటల్ లీడర్ల అభిప్రాయాల సేకరణ ద్వారా ఈ టాలెంట్ టెక్ ఔట్లుక్ సర్వే నివేదించారు. సర్వేలు, సోషల్ మీడియా ఇన్పుట్స్, ఇంటర్య్యూలు, ప్యానెల్ చర్చాగోష్టుల ద్వారా స్కైకీ ఈ సమాచారం సేకరించింది. వర్క్ ఫ్రం హోం వల్ల ఎక్కువ పనితోపాటు అధిక ఉత్పాదకత తేవడం.. ఒత్తిడి తక్కువగా ఉంటుందని 64 శాతం మంది ఉద్యోగులు అంటున్నారు.
హెచ్ఆర్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఇప్పుడు వర్క్ ఫ్రం హోం ఉద్యోగులతో ఫేస్ టు ఫేస్ చర్చించడం కంటే వర్చువల్గా మాత్రమే చర్చిస్తున్నారు. 80 శాతానికి పైగా హెచ్ఆర్ మేనేజర్లు ఉద్యోగులు ఫుల్టైం ఆఫీసులో ఉండటం చాలా కష్ట సాధ్యంగా ఉంటుందన్నారు. వర్క్ ఫ్రం హోం సంస్కృతి ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. కానీ ప్రతి టెక్కీ.. తమ యాజమాన్యం వర్క్ ఫ్రం ఆఫీసు సేవలందించాలని అడగక పోవచ్చంటున్నారు. ప్రతిభావంతులైన టెక్నికల్ నిపుణులను కాపాడుకోవడానికి ప్రాధాన్యం ఇస్తారంటున్నారు.
వర్క్ ఫ్రం హోం పట్ల టెక్ నిపుణుల్లో ప్రేమ పుట్టుకొచ్చింది. స్వేచ్ఛతోపాటు ప్రొడక్టివిటీ తగ్గకపోవడంతో హెచ్ఆర్ విభాగాల్లో విశ్వాసం పరిడవిల్లుతుందంటున్నారు. తమ సేవలను సంస్థలు ఉపయోగించుకోని తరుణంలో టెక్ నిపుణులు కరోనా ముందు రోజుల కంటే వేగంగా ఆల్టర్నేటివ్స్ వెతుక్కుంటున్నారు.
టెక్నాలజీలో మార్పులు రావడంతో కంపెనీలు కూడా తమ ఉద్యోగులతో సంప్రదింపులు జరుపడానికి వెసులుబాటుగా ఉంటుంది. అర్థవంతంగా, లోతుగా చర్చించుకునే వీలుండటం ప్రతి ఒక్కరికీ అడ్వాంటేజీగా మారింది. 2019తో పోలిస్తే 18 శాతం టెక్ హైరింగ్ మేనేజర్లు 2022లో నిపుణుల మానసిక పరిస్థితిని అంచనా వేస్తున్నారట. 2019లో అది 68 శాతంగా ఉంది. రిమోట్ వర్కింగ్ అమల్లోకి వచ్చాక తరుచుగా మీటింగ్స్ ఆల్టర్నేటివ్ వర్క్ ప్లేసెస్లో జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది.