Reliance | ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ సంచలన నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకు సంస్థ తనకు ఉన్న రుణ భారాన్ని వదిలించుకునేందుకు ఓవర్సీస్ బాండ్లు జారీ చేయాలని నిర్ణయానికి వచ్చింది. 500 కోట్ల డాలర్ల విలువ గల బాండ్లను జారీ చేయాలని శనివారం జరిగిన కంపెనీ సమావేశంలో తీర్మానించినట్లు సమాచారం. విదేశీ కరెన్సీ ప్రాధాన్యం గల బాండ్లను రిలయన్స్ జారీ చేయనున్నది.
యూఎస్ డాలర్ డినామినేషన్ కలిగి ఉండి ఫిక్స్డ్ రేట్ గల సీనియర్ అన్ సెక్యూర్డ్ బాండ్లను జారీ చేయనున్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. దేశీయ చట్టాలకు లోబడి ఈ బాండ్లు జారీ చేయాలని రిలయన్స్ నిర్ణయించింది. అయితే, ఇప్పటికిప్పుడు బాండ్ల ధర వరల వివరాలు, ఎప్పుడు జారీ చేస్తారన్న సంగతి బయటపెట్టలేదు.
పదేండ్లు, 30 ఏండ్ల గడువు గల డెట్ బాండ్లు ఆఫర్ చేసే అవకాశాలు ఉన్నాయి. యూఎస్ ట్రెజరీ బెంచ్మార్క్కు అనుగుణంగా సదరు బాండ్ల విలువ 110-130 బేసిక్ పాయింట్లు, 130-140 బేసిక్ పాయింట్లు ఉండొచ్చునని సమాచారం. శరవేగంగా విస్తరిస్తున్న డిజిటల్, రిటైల్ వెంచర్లతోపాటు క్లీన్ ఎనర్జీ బిజినెస్లోకి ఎంటర్ కావాలని రిలయన్స్ ప్రణాళికలు రూపొందించుకున్న సంగతి తెలిసిందే.