Reliance | ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ నిధుల సేకరణపై కేంద్రీకరించింది. సంస్థ ఇన్వెస్టర్ల నుంచే అదనపు నిధులు సేకరించడానికి ప్రయత్నాలు చేస్తు్న్నది. సింగపూర్, అబుదాబీ, సౌదీ అరేబియాల్లోని సావరిన్ వెల్త్ ఫండ్ సంస్థల నుంచి దాదాపు రూ.12,44,208 కోట్ల (150 కోట్ల డాలర్లు) కొత్త పెట్టుబడులు సేకరించాలని తలపెట్టింది. దేశంలోని అతిపెద్ద రిటైల్ నెట్ వర్క్ గల సంస్థ రిలయన్స్ రిటైల్.
తొలి దశలో ఈ నెలాఖరు నాటికి 350 కోట్ల డాలర్ల నిధులు సేకరించడానికి ఇన్వెస్టర్లతో సంప్రదింపులు జరుపుతున్నది. గత నెలలో ‘క్యూఐఏ’ సంస్థ 100 కోట్ల డాలర్లు, ఈ వారంలో కేకేఆర్ అండ్ కో 250 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడతామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
సింగపూర్ జీఐసీ, అబుదాబీ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ఏడీఐఏ), సౌదీ అరేబియా పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (పీఐఎఫ్) వేర్వేరుగా 500 మిలియన్ డాలర్ల చొప్పున పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై స్పందించడానికి జీఐసీ, ఏడీఏఐ మాట్లాడేందుకు నిరాకరించాయి. పీఐఎఫ్ స్పందించేందుకు ముందుకు రాలేదు. మీడియా వార్తలు, వదంతులపై స్పందించలేమని రిలయన్స్ పేర్కొంది.