ముంబై : డిస్నీ ఇండియా (Disney) వ్యాపారాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేసేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ మెగా డీల్ త్వరలో పట్టాలెక్కనుంది. డిస్నీ స్టార్ బిజినెస్లో మేజర్ వాటాను రిలయన్స్కు డిస్నీ విక్రయించనుందని బ్లూమ్బర్గ్ వెల్లడించింది. ఈ ఒప్పందం విలువ ఏకంగా 80,000 కోట్లు ఉంటుందని అంచనా.
వచ్చే నెలలోనే ఈ భారీ డీల్ను ప్రకటిస్తారని, ఒప్పందం అనంతరం భారత వ్యాపారంలో డిస్నీ మైనారిటీ వాటా కలిగిఉంటుందని ఈ రిపోర్ట్ పేర్కొంది. ఈ ఒప్పందంపై కంపెనీ విలువను లెక్కగట్టే విషయంలో ఇంకా తుది నిర్ణయానికి రాలేదని తెలిపింది. ఈ వార్తలపై డిస్నీ, రిలయన్స్ ఇప్పటివరకూ స్పందించలేదు.
రిలయన్స్ స్ట్రీమింగ్ ప్లాట్ఫాం జియో సినిమాలో ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఫ్రీ యాక్సెస్ ఇవ్వడంతో డిస్నీ ఇండియా స్ట్రీమింగ్ ఆపరేషన్స్పై ఒత్తిడి పెరిగింది. ఐపీఎల్ డిజిటల్ హక్కులు అంతకుముందు డిస్నీ చేతిలో ఉండగా ముఖేష్ అంబానీ ఈ హక్కులను దక్కించుకుని జియోసినిమాలో ఫ్రీ స్ట్రీమింగ్ ఇవ్వడం రిలయన్స్ స్ట్రీమింగ్ ప్లాట్ఫాం జియోసినిమాకు ఆదరణ పెరిగింది.
Read More :
గార్బా నృత్య ప్రదర్శనల్లో గుండెపోటుతో 10 మంది మృతి