న్యూఢిల్లీ, ఆగస్టు 10: రాబోయే స్వాతం త్య్ర దినోత్సవం సందర్భంగా రిలయన్స్ జియో ఓ సరికొత్త ఆఫర్ను ప్రకటించింది. రూ.2,999 రిచార్జ్తో ప్రీపెయిడ్ ప్లాన్ను తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా సంస్థ పరిచయం చేసింది. ఈ ప్లాన్లో ఏడాదిపాటు డైలీ 2.5జీబీ డాటా వస్తుంది. రోజువారీ పరిమితి దాటితే ఇంటర్నెట్ స్పీడ్ 64కేబీపీఎస్కు పడిపోతుంది. అలాగే ఈ కొత్త ప్లాన్ కొనుగోలుదారులకు రూ.3,000 విలువైన అదనపు ప్రయోజనాల్నీ కల్పించింది. జియో యాప్స్ పొంద వచ్చు.
కాగా, ప్రస్తుతం జియో విక్రయిస్తున్న ఇతర వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ల విషయానికొస్తే రూ.2,879, రూ.2,545 ప్లాన్లున్నాయి. రూ.2,879 రిచార్జ్పై ఏడాది కాలపరిమితి, అపరిమిత వాయిస్ కాల్స్, రోజూ 2జీబీ డాటా, డైలీ 100 ఎస్ఎంఎస్లు, జియో యాప్స్, సేవల సౌకర్యం అందుతున్నది. రూ.2,545 రిచార్జ్తో 336 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత వాయిస్ కాల్స్, రోజూ 1.5జీబీ డాటా, డైలీ 100 ఎస్ఎంఎస్లు, జియో యాప్స్, సేవల సౌకర్యం ఉంటుంది.