Reliance Jio | ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ జియో సప్తమ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నది.. ఈ శుభ సందర్భంలో తన సబ్స్క్రైబర్లకు సెలెక్టెడ్ ప్లాన్లపై అదనపు బెనిఫిట్లు కల్పిస్తున్నది. రూ.299 ప్లాన్పై 7జీబీ డేటా, రూ.749 ప్లాన్ మీద 14 జీబీ డేటా, రూ.2999 వార్షిక ప్లాన్ మీద 21 జీబీ అదనంగా పొందొచ్చు. ఈ ఆఫర్లు ఈ నెలాఖరు వరకే వర్తిస్తాయని జియో మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. మెక్ డొనాల్డ్స్, రిలయన్స్ డిజిటల్, ఫ్లైట్స్, హోటల్స్ నెట్ మెడ్స్, అజియో కూపన్లు పొందొచ్చు.
28 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్ రూ.299 పై ప్రతి రోజూ 2జీబీ డేటాతోపాటు అపరిమిత కాల్స్, 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. వార్షికోత్సవ ఆఫర్ కింద 7 జీబీ డేటా అదనంగా పొందొచ్చు.
90 రోజుల వ్యాలిడిటీ గల రూ.749 ప్రీ పెయిడ్ ప్లాన్పై 2జీబీ డేటా, అపరిమిత కాల్స్, ప్రతి రోజూ 100 ఎస్ఎంఎస్లు చేసుకోవచ్చు. ఇప్పుడు అదనంగా 14 జీబీ డేటా లభిస్తుంది. ఇందుకోసం రెండు 7 జీబీ డేటా కూపన్లు పంపిణీ చేస్తుంది జియో.
రూ.2,999 విలువైన వార్షిక ప్రీ-పెయిడ్ ప్లాన్ మీద ప్రతి రోజూ 2.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్, 100 ఎస్ఎంఎస్ లు పంపుకోవచ్చు. 21 జీబీ డేటా అదనంగా లభిస్తుంది. మూడు 7జీబీ డేటా కూపన్లలో విడుదల చేస్తుంది.
ఈ రీచార్జి ప్లాన్ తోపాటు రూ.149, అంతకంటే ఎక్కువ మెక్ డొనాల్డ్ భోజనం బిల్లుపై కాంప్లిమెంటరీ కూపన్, రిలయన్స్ డిజిటల్ లావాదేవీల్లో 10 శాతం డిస్కౌంట్. విమాన ప్రయాణంలో టికెట్ పై రూ.1500 రాయితీ, యాత్రా హోటళ్లలో బస చేస్తే రూ.400 వరకూ 15 శాతం డిస్కౌంట్, అజియో, నెట్ మెడ్స్ కొనుగోళ్లు రూ.800 నుంచి 20 శాతం డిస్కౌంట్ అందిస్తుంది రిలయన్స్ జియో.