Reliance-Disney Merger | న్యూఢిల్లీ, డిసెంబర్ 25: ఎంటర్టైన్మెంట్ వ్యాపారాల్ని విలీనం చేసేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీల మధ్య డీల్ కుదిరింది. దీంతో 2024 ఫిబ్రవరికల్లా భారత్లో మెగా ఎంటర్టైన్మెంట్, మీడియా విలీనాన్ని పూర్తిచేసేందుకు మార్గం సుగమమైంది.
కొద్ది నెలలుగా రిలయన్స్, డిస్నీలు ఇందుకు సంబంధించిన చర్చలు జరుపుతున్నాయి. డీల్లో భాగంగా రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సబ్సిడరీ వయోకామ్ 18.. డిస్నీ స్టార్ ఇండియా ప్రధాన వాటాను విలీనం చేసుకుంటుంది. విలీన సంస్థలో రిలయన్స్కు 51 శాతం, డిస్నీకి 49 శాతం వాటా చొప్పున ఉంటుంది.