న్యూఢిల్లీ, అక్టోబర్ 12: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మళ్లీ తొలి స్థానాన్ని దక్కించుకున్నారు. మొన్నటికి మొన్న హురున్ శ్రీమంతుల జాబితాలో దేశీయ కుబేరుడిగా అవతరించిన ముకేశ్..ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన జాబితాలో కూడా తొలి స్థానం దక్కించుకున్నారు. 2023 ఏడాదికిగాను ఫోర్బ్స్ దేశీయ కుబేరుల జాబితాను గురువారం విడుదల చేసింది. ఈ జాబితాలో ముకేశ్ అంబానీ సంపద 1.5 బిలియన్ డాలర్లు పెరిగి 91.4 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు తెలిపింది. ఇదే సమయంలో గతేడాది తొలిస్థానంలో నిలిచిన గౌతమ్ అదానీ సంపద కేవలం 129 మిలియన్ డాలర్లు పెరిగి 54.2 బిలియన్ డాలర్లతో రెండో స్థానం సరిపెట్టుకున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో శివ్ నాడార్, సావిత్రి జిందాల్, సైరస్ పునావాలా, దిలీప్ సంఘ్వీ, కుమార మంగళం బిర్లాలు ఉన్నారు.