హైదరాబాద్, జనవరి 24: గణతంత్ర దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని రిలయన్స్ డిజిటల్.. ‘డిజిటల్ ఇండియా సేల్’ ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 28 వరకు అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్ కింద బ్యాంకుల కార్డులపై రూ.26 వేల వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చునని తెలిపింది. ఈ ప్రత్యేక ఆఫర్లు టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ల్యాప్టాప్లు, వాషింగ్ మెషిన్లతోపాటు ఇతర ఎలక్ట్రానిక్స్ పరికరాలను తగ్గింపు ధరలో విక్రయిస్తున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్లలో భాగంగా 55 అంగుళాల గూగుల్ క్యూలెడ్ టీవీ ప్రారంభ ధర రూ.34,990, 75 అంగుళాల యూహెచ్డీ గూగుల్ టీవీ ప్రారంభ ధర రూ.66,990కి లభించనున్నది. ఈ టీవీలపై రెండేండ్ల వ్యారెంటీ కూడా కల్పిస్తున్నది.