హైదరాబాద్, ఆగస్టు 12: రిలయన్స్ డిజిటల్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మరోసారి ‘డిజిటల్ ఇండియా సేల్’ ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్లలో భాగంగా స్మార్ట్ఫోన్లు, యాపిల్ ఎయిర్ప్యాడ్స్, వాషింగ్ మెషిన్లు, ఇతర గాడ్జెట్లను తగ్గింపు ధరకు విక్రయిస్తున్నది.
ఈ నెల 15 వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్ అన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాలకు వర్తించనున్నది. అలాగే రూ.5 వేల వరకు ఇన్స్టాంట్ డిస్కౌంట్తోపాటు అన్ని రకాల డెబిట్, క్రెడిట్ కార్డ్లపై 10 శాతం రాయితీ వోచర్లు ఇస్తున్నది. ఈ ఆఫర్లు రిలయన్స్ డిజిటల్ స్టోర్, మై జియో స్టోర్లో కూడా లభించనున్నాయి. 75 అంగుళాల యూహెచ్డీ టీవీని కేవలం రూ.69, 990కే అందిస్తున్నది.