భారత్లో ఎంఐ 11Xగా పేరొందిన రెడ్మి కే40 సక్సెసర్ కోసం న్యూ సిరీస్ స్మార్ట్ఫోన్లపై కసరత్తు సాగిస్తున్న షియోమి రెడ్మి కే50, రెడ్మి కే50 ప్రొ, రెడ్మి కే50 ప్రొ+ వంటి మూడ స్మార్ట్ఫోన్లను కస్టమర్ల ముందుకు తీసుకురానుంది. వీటిలో ఫ్లాగ్షిప్ మోడల్గా భావిస్తున్న రెడ్మి కే50 ప్రొ+ పట్ల అందరూ ఫోకస్ పెడుతున్నారు.
రెడ్మి కే50 ప్రొ+ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 898 ప్రాసెసర్, అమోల్డ్ డిస్ప్లే, ఇన్ డిస్ప్లే ఫింగర్ప్రింట్ సెన్సర్ వంటి ఫీచర్లతో రానుందని లీకులు వచ్చాయి. రెడ్మి కే50 ప్రొ+ ట్రిపుల్ లెన్స్ కెమెరా సెటప్, 108 మెగాపిక్సెల్ లెన్స్, పెరిస్కోప్ జూమ్లెన్స్, 5000ఎంఏహెచ్ కెపాసిటీతో కూడిన బ్యాటరీ, 67 వాట్స్ రాపిడ్ చార్జింగ్ సపోర్ట్ వంటి స్పెసిఫికేషన్స్ ఉంటాయని లీకుల్లో వెల్లడైంది. ఇక వచ్చే ఏడాది మార్చిలో రెడ్మి కే50 ప్రొ+ భారత్లో లాంఛ్ అవుతుందని భావిస్తున్నారు.