న్యూఢిల్లీ : భారత్లో బడ్జెట్ ధరతో రెడ్మి 13సీని (Redmi 13C 5G) కంపెనీ లాంఛ్ చేసింది. ప్రీమియం డిజైన్తో ఈ 5జీ ఫోన్ కస్టమర్లను ఆకట్టుకుంటుంది.ఈ హాట్ డివైజ్ 90హెచ్జడ్ డిస్ప్లే, 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం, 50 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా వంటి ఫీచర్లను కలిగిఉంది.
రెడ్మి లేటెస్ట్ స్మార్ట్ఫోన్ లావా బ్లేజ్ ప్రొ 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఎం14 వంటి ఇతర 5జీ ఫోన్లకు దీటైన పోటీ ఇవ్వనుంది. భారత్లో రెడ్మి 13సీ 5జీ ఫోన్ను రూ 10,999 నుంచి అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. స్టార్ట్రైల్ సిల్వర్, స్టార్ట్రైల్ గ్రీన్, స్టార్లైట్ బ్లాక్ వంటి మూడు రంగుల్లో ఈ డివైజ్ లభిస్తుంది.
రెడ్మి 13సీ 6.74 ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లేతో హెచ్డీ రిజల్యూషన్తో కస్టమర్ల ముందుకు వచ్చింది రియల్మీ 11ఎక్స్, రియల్మీ 11 5జీలో వాడే చిప్సెట్ 6ఎన్ఎం మీడియాటెక్ డైమన్సిటీ 6100+ ప్రాసెసర్ను కలిగిఉంది. ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్ను వాడుతూ ఈ డివైజ్ 16జీబీ వరకూ ర్యాంను ఎక్స్టెండ్ చేసుకునే వెసులుబాటు ఉంది.
Read More :
UGC NET | నేటి నుంచి యూజీసీ నెట్ పరీక్షలు.. అడ్మిట్ కార్డులను ఇలా డౌన్లోడ్ చేసుకోండి