హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): నోటు స్కాంకు మోదీ బాధ్యత వహించాలని, తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని రెడ్ కో చైర్మన్ వై సతీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. మోదీ సరారు చరిత్రలోనే ఎవరూ కనీవినీ ఎరుగని సాంనకు పాల్పడిందని ఆరోపించారు.
కొత్తగా ముద్రించిన దాదాపు రూ.88,032 కోట్ల విలువైన 500 రూపాయల నోట్లు మాయమయ్యాయని, ఓ వ్యక్తి సమాచార హకు చట్టం కింద దరఖాస్తు చేయడంతో ఈ విషయం బయటపడిందని తెలిపారు. దేశంలోని మూడు ఆర్బీఐ నోట్ల ముద్రణాలయాల్లో ప్రింట్ అయిన నోట్లు మాయం కావడం దారుణమని పేర్కొన్నారు. తాము నోట్టను ముద్రించి పంపించేసామని సంస్థ లు చెప్తున్నాయని, అలాంటప్పుడు రూ.88 వేల కోట్లు ఏమైపోయాయని ప్రశ్నించారు.