న్యూఢిల్లీ, ఆగస్టు 4: భారత్లో ఐఫోన్ అమ్మకాలు జోరుగా పెరగడంతో జూన్ త్రైమాసికంలో యాపిల్ రికార్డు ఆదాయాన్ని ఆర్జించిందని ఆ కంపెనీ సీఈవో టిమ్కుక్ వెల్లడించారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద స్మార్ట్ఫోన్ మార్కెట్ అయిన భారత్లో యాపిల్ వాటా కనిష్ఠంగానే ఉన్నప్పటికీ, కంపెనీ ఎర్నింగ్స్ కాల్లో ఇండియాలో తమ పనితీరును కుక్ ప్రత్యేకంగా వివరించారు.
తాము కొత్తగా ప్రారంభించిన రెండు రిటైల్ స్టోర్స్లో అమ్మకాలు తమ అంచనాల్ని మించాయన్నారు. జూన్ త్రైమాసికంలో రెండంకెల వృద్ధి సాధించామని యాపిల్ సీఈవో తెలిపారు. ముంబై, ఢిల్లీల్లో యాపిల్ ఇటీవల స్టోర్లను నెలకొల్పిన సంగతి తెలిసిందే. అలాగే మొత్తం ఐఫోన్లలో 5 శాతం భారత్ ప్లాంట్లలో ఉత్పత్తవుతున్నాయి.