ముంబై, డిసెంబర్ 14: ఒక వైపు ఎగుమతులు తగ్గుముఖం పట్టడం, చమురు ధరలు అధికస్థాయిలో కొనసాగడంతో భారత్ కరెంట్ ఖాతా లోటు రికార్డుస్థాయికి పెరుగుతుందని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో ఇది జీడీపీలో 4.4 శాతానికి చేరుతుందని రేటింగ్ ఏజెన్సీ తెలిపింది. శాతంలో చూస్తే ఇది 37 త్రైమాసికాల గరిష్ఠస్థాయి. 2013-14 తొలి క్వార్టర్లో అప్ప టి జీడీపీలో 4.7 శాతానికి చేరినప్పటికీ, అది పరిమాణం రీత్యా 31.8 బిలియన్ డాలర్లే. నిరుడు ఇదే త్రైమాసికంలో 9.3 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో క్యాడ్ 23.9 బిలియన్ డాలర్ల వద్ద నిలిచింది.
8 త్రైమాసికాల కనిష్ఠానికి ఎగుమతులు
అంతర్జాతీయంగా డిమాండ్ మందగించిన ఫలితంగా ఎగుమతులు క్షీణిస్తున్నాయని, 2022 అక్టోబర్లో ఇవి దాదాపు 20 శాతం తగ్గాయని తెలిపింది. 2021 ఫిబ్రవరి తర్వాత ఎగుమతుల తగ్గుదల ఇదే ప్రథమమని పేర్కొ ంది. ఈ క్యూ3లో ఎగుమతులు నిరుడు ఇదేకాలంతో పోలిస్తే 17.4 శాతం క్షీణించి, 88.2 బిలియన్ డాలర్లకు దిగివస్తాయని అంచనా వేసింది. క్యూ3లో దిగుమతులు 171.9 బిలియన్ డా లర్లకు చేరతాయని, దీంతో 2022 అక్టోబర్-డిసెంబర్లో వాణిజ్యలోటు 83.7 బిలియన్ డాలర్ల గరిష్ఠానికి చేరుకుంటుందన్నది.