ముంబై, అక్టోబర్ 25: ప్రైవేట్ బ్యాంకులు కనీసంగా ఇద్దరు హోల్-టైం డైరెక్టర్లను నియమించుకోవాలని రిజర్వు బ్యాంక్ సూచించింది. మేనేజింగ్ డైరెక్టర్తోపాటు సీఈవోలు కలుపుకొని కనీసంగా ఇద్దరు నియమించుకోవాలని బుధవారం సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది.
బ్యాంకింగ్ రంగం సవాళ్లను ఎదుర్కొంటున్నదని, వీటిని అధిగమించాలంటే కనీసం ఇద్దరు హోల్-టైం డైరెక్టర్లను నియమించుకోవాలని ప్రైవేట్ బ్యాంక్లను ఆదేశించింది.