యూపీఐ లైట్ ద్వారా ఒక్కో లావాదేవీ పరిమితిని రూ.500 లకు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా, వినియోగదారుల విజ్ఞప్తి మేరకే పెంచినట్టు గవర్నర్ దాస్ స్పష్టం చేశారు. ఇది నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (ఎన్ఎసీఎంసీ) లావాదేవీలకూ కలిసి రానున్నది. కాగా, ప్రస్తుతం రూ.200లకు మించి లావాదేవీ జరుగడం లేదు.
అలాగే ఓవరాల్గా ఒక్కో పేమెంట్ ఇన్స్ట్రూమెంట్ నుంచి రూ.2000 వరకు లావాదేవీలు చేసుకోవచ్చు. అయితే ఇందులో మాత్రం ఎటువంటి మార్పూ లేదు. అధిక విలువ, తక్కువ విలువ లావాదేవీల కోసం యూపీఐ ఉన్న విషయం తెలిసిందే. కానీ తక్కువ లావాదేవీల కోసమే యూపీఐ లైట్. పిన్ నెంబర్తో పనిలేకుండానే నగదు పంపించుకోవచ్చు.