RBI | రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) సిద్ధమైంది. చట్టవిరుద్ధ లెండింగ్ యాప్స్’ను నిలువరించేందుకు డిజిటల్ ఇండియా ట్రస్ట్ ఏజెన్సీ (డీఐజీఐటీఏ) ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. వెరిఫైడ్ యాప్స్ కోసం రిజిస్టర్, డిజిటల్ లెండింగ్ యాప్స్ వెరిఫికేషన్ కోసం సంస్థ ఏర్పాటు చేయడమే డీఐజీఐటీఏ లక్ష్యం అని అధికార వర్గాలు తెలిపాయి. డిజిటల్ యుగంలో ఆర్థిక నేరాలపై పోరాడేందుకు ఈ ‘డీఐజీఐటీఏ‘ ఉపకరిస్తుందని ఆ వర్గాల కథనం.
చట్ట విరుద్ధంగా ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న లెండింగ్ యాప్స్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు ఈ సంస్థకు అధికారం కల్పిస్తుంది. డీఐజీఐటీఏ వెరిఫికేషన్ లేని యాప్స్ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. రోజురోజుకి డిజిటల్ లెండింగ్ యాప్స్ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజల్లో విశ్వాసం కల్పించడానికి, పారదర్శకత, అకౌంటబిలిటీ కల్పించేందుకు డీఐజీఐటీఏ దోహద పడుతుందని భావిస్తున్నారు.