RBI Shock | ఇప్పుడు బ్యాంకింగ్ లావాదేవీలంటేనే ఇప్పుడు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులతో మొదలవుతాయి. దీనికి తోడు సేవింగ్స్ ఖాతాల్లో కనీస నిల్వలు లేకపోతే ఆయా బ్యాంకులు జరిమానా విధిస్తున్నాయి. ఇక క్రెడిట్ కార్డులు సంబంధిత యూజర్ల ఆదాయాన్ని బట్టి బ్యాంకులు జారీ చేస్తాయి. ఇక్కడో సమస్య ఉంది. బ్యాంక్ ఎగ్జిక్యూటివ్లు అవసరం లేకున్నా.. ఇతర బ్యాంకుల ఖాతాదారులకు ఫోన్ చేసి క్రెడిట్ కార్డులు తీసుకోవాలని సూచిస్తుంటారు. ఆయా క్రెడిట్ కార్డుల వాడకాన్ని బట్టి బిల్లు సకాలంలో చెల్లిస్తే నో ప్రాబ్లం. లేని పక్షంలో పెనాల్టీ బిల్లుల మోత మోగుతుంది. అత్యధిక విలువ గల క్రెడిట్ కార్డు సర్వీస్ చార్జీలు కూడా ఎక్కువే.
క్రెడిట్/ డెబిట్ యూజర్లు మోసాలకు గురవుతుంటారు. ఈ మోసాలు, చార్జీల భారీ నుంచి ఖాతాదారులను రక్షించడానికి భారతీయ రిజర్వు బ్యాంకు సంసిద్ధమైంది. అందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. వచ్చే జూలై ఒకటో తేదీ నుంచి ఈ మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయి. తత్ఫలితంగా డెబిట్/ క్రెడిట్ కార్డుల వాడకందారులకు రక్షణతోపాటు సేవల్లో పారదర్శకత పెరుగుతుందని ఆర్బీఐ పేర్కొంది.