న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: రుణాలు చెల్లింపుచేయనివారికి ఉద్దేశపూర్వక ఎగవేతదార్లుగా వర్గీకరించడానికి ఆర్బీఐ కఠిన నిబంధనల్ని ప్రతిపాదించింది. ఇందుకోసం ఉద్దేశపూర్వక ఎగవేతదార్లు, పెద్ద ఎగవేతదార్లను ఎలా పరిగణించాలన్నదానిపై బ్యాంక్లకు, ఆర్థిక సంస్థలకు ముసాయిదా మార్గదర్శకాల్ని విడుదల చేసింది.
రూ.25 లక్షలకు పైగా రుణ చెల్లింపులు జరగని ఖాతాలన్నింటినీ ఆయా బ్యాంక్లు, ఆర్థిక సంస్థలు పరిశీలించి, రుణగ్రస్తుడు అప్పును ఉద్దేశపూర్వకంగా చెల్లించడం లేదా? లేక ఇతర కారణాలున్నాయా అనేది నిర్దారించుకోవాలని సూచించింది. ఏదైనా ఖాతా ఎన్పీఏగా వర్గీకరించిన తర్వా త ఆరు నెలల లోగా ఆ రుణ ఎగవేత ఉద్దేశపూర్వకంగా జరిగిందో లేదో తేల్చాలన్నది.