ముంబై, నవంబర్ 24: మూడు బ్యాంక్లపై రిజర్వు బ్యాంక్ కొరడా ఝులిపించింది. పలు నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించినట్టు తేలడంతో ప్రభుత్వరంగ బ్యాంకులైన బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్తోపాటు సిటీ బ్యాంక్లపై రూ.10.34 కోట్ల జరిమానా విధించింది. వీటిలో అత్యధికంగా సిటీబ్యాంక్పై రూ.5 కోట్లు విధించింది. డిపాజిటరీ ఎడ్యుకేషన్, ఫండ్ స్కీంలను అవగాహణ కల్పించడంలో విఫలం కావడంతో సెంట్రల్ బ్యాంక్ కన్నెర్రచేసింది. అలాగే బీవోబీపై 4.34 కోట్లు, ఐవోబీపై కోటి రూపాయలు జరిమానా విధించింది.